Wednesday, June 18, 2025

పెద్దదిక్కు లేక డీలా!

- Advertisement -
- Advertisement -

తొలి విడత మంత్రి వర్గ విస్తరణలో మంథని ఎంఎల్‌ఎ దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు మంత్రి వర్గంలో చోటు కల్పించారు. రెండవ విడత మంత్రి వర్గంలో పలువురు మంత్రి పదవులు ఆశించినా ధర్మపురి ఎంఎల్‌ఎ అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు కాంగ్రెస్ అధిష్టానం అవకాశం కల్పించింది. కరీంనగర్ జిల్లాకు (karimnagar minister) మంత్రి పదవి లేకపోవడంతో మంత్రి శ్రీధర్ బాబు మాత్రమే అధికార కార్యక్రమాలైన జెండా పండుగలకు హాజరు అవుతున్నారు. జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకు అడ్లూరి, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తారంటు ప్రచారం జోరుగా కొనసాగుతున్నది.

ఒకప్పుడు మంత్రులతో కళకళలాడిన కరీంనగర్ నేడు మంత్రులు లేక జిల్లా కేంద్రం వెలవెలబోతున్న ది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది కరీంనగర్ దుస్థితి. తెలంగాణ సాధన కో సం ఏది తలపెట్టాలన్నా కరీంనగర్ నుంచే ప్రారంభం అయ్యేది. అలాంటి పేరున్న కరీంనగర్ జిల్లా (karimnagar minister) కేంద్రానికి కాంగ్రెస్ పాలనలో అసలైన నాయకుడు లేక తల్లడిల్లుతున్నది. కరీంనగర్ కేంద్రం ఒక ప్పుడు మంత్రులతో రాకతో ఎర్రబుగ్గ కారులు కుయ్యి.. కుయ్యి అనే శబ్దాలతో కాన వచ్చిన కన్నారం ఇప్పుడు మాత్రం కానరావడం లేదని అందరి నోటా అదే మాట వినిపిస్తున్నది. సమస్యలు చెప్పుకుని.. విప్పుకుందామన్న సరై‘అయి’నా లీడర్ లేకపాయే… ప్రజల మంచికో.. చెడుకో జిల్లా కేంద్రంగా మంత్రి ఉండాలని కోరుకుంటున్నారు.

రాజకీయంగా డీలాపడ్డా కరీంనగర్

కరీంనగర్ జిల్లా అంటేనే ఉద్యమాల ఖిల్లా.. వెలుగులు వెలిగిన జిల్లా.. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించింది. తెరాస 14 సంవత్సరాల పాలనలో ఉమ్మడి జిల్లాలో నలుమూలల నుండి మూడు నియోజక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించి మంత్రి పదవులు ఇచ్చారు. కరీంనగర్ జిల్లాకు మంత్రి వర్గ విస్తరణలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ అధిక ప్రాధాన్యత కల్పించారు. నగరం స్మార్ట్ సిటీ నిధులతో అద్భుతంగా మారినప్పటికీ అధికార పార్టీకి అసలైన నేత లేక జిల్లా ఇప్పుడు వెలవెలబోతున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 13 నియోజక వర్గాల్లో హుస్నాబాద్, సిద్దిపేట కొత్త జిల్లాలో ఉండగా, మిగతా 12 నియోజక వర్గాలు మాత్రం పాత కరీంనగర్‌లోనే ఉన్నాయి. 13 నియోజక వర్గాల్లో 5 స్థానాలైనా సిరిసిల్ల, కరీంనగర్, హుజురాబాద్, కోరుట్ల, జగిత్యాలలో గులాబీ జెండా ఎగిరింది. మిగతా 8 స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. తొలి విడత మంత్రి వర్గ విస్తరణలో మంథని ఎంఎల్‌ఎ దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు మంత్రి వర్గంలో చోటు కల్పించారు. రెండవ విడత మంత్రి వర్గంలో పలువురు మంత్రి పదవులు ఆశించినా ధర్మపురి ఎంఎల్‌ఎ అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు కాంగ్రెస్ అధిష్టానం అవకాశం కల్పించింది. కరీంనగర్ జిల్లాకు మంత్రి పదవి లేకపోవడంతో మంత్రి శ్రీధర్ బాబు మాత్రమే అధికార కార్యక్రమాలైన జెండా పండుగలకు హాజరు అవుతున్నారు.

జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకు అడ్లూరి, పెద్దపల్లి, కరీంనగర్ (karimnagar minister) జిల్లాలకు శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తారంటు ప్రచారం జోరుగా కొనసాగుతున్నది. రెండు పార్లమెంట్ నియోజక వర్గాలు ఉండగా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని చెన్నూరు, మంథని, ధర్మపురి నియోజకవర్గాల ఎంఎల్‌ఎలకు మాత్రం మంత్రి పదవులు దక్కగా, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని హుస్నాబాద్ ఎంఎల్‌ఎ పొన్నం ప్రభాకర్‌కు మాత్రమే మంత్రి వర్గంలో చోటు లభించింది. కరీంనగర్ పాత జిల్లా ఒకప్పుడు వెలుగులు వెలుగగా ఇప్పుడు మాత్రం మంత్రులతో విడిపోయిన జిల్లాలు వెలుగులు వెలుగుతున్నాయని అందరినోటా అదే మాట వినిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీలో వర్గపోరుతో కరీంనగర్ జిల్లాకు సరైనా పదవులు రావడం లేదని ఆ పార్టీ నేతల్లో చర్చ జరుగుతున్నది. ఇటీవల ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల జరిగిన కాంగ్రెస్ సమావేశాల్లో తోపులాట, కుస్తీలాటే.. దీనికి నిలువెత్తు సాక్షం ఎఐసిసి నేతలే అని చెప్పక తప్పదు.

అప్పటి తెలంగాణ తొలి సిఎం కెసిఆర్ అండదండలతో స్మార్ట్ సిటీ హోదా దక్కించుకున్న విషయం అందరికీ తెలిసిందే. కరీంనగర్ అభివృద్ధికి నిధుల కొరత లేకున్నా నేడు అభివృద్ధి పనులకు ఆటంకాలు కలుగక తప్పడం లేదు. రాష్ట్ర ఆవిర్భావం తరువాత కూడా కరీంనగర్ ఆనాటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేసింది. ప్రతి పథకాన్ని కరీంనగర్ నుండే ఆనాటి సిఎం కెసిఆర్ శ్రీకారం చుట్టారు. ఇప్పడు మాత్రం ప్రభుత్వ పాలకుల మదిలో కానరావడం లేదు. ఎలాంటి అభివృద్ధి ముందుకు సాగడం లేదని, పని చేసే వారికి గుర్తింపు ఇవ్వడం లేదని జరిగిన కాంగ్రెస్ సమావేశాలో పార్టీ శ్రేణులు ఆ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసి నిరసన తెలపగా, అగ్రనేతల బుజ్జగింపులతో నిరసనలు సద్దుమణిగాయి. కరీంనగర్‌కు లీడర్ అనే వ్యక్తి లేకపోవడంతో అధికారులు సైతం తమకు పని చేయడం లేదని ఆ పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉన్న లీడర్ వద్దకు వెళ్దామన్నా మరో లీడర్‌కు సమాచారం వెళుతుందని గుట్టుచప్పుడు కాకుండా ఉంటున్నారు. ఉద్యమ పోరు జిల్లా కేంద్రంలో ఒక మంత్రినే ప్రతి కార్యకర్తకూ, ప్రతి ఒక్కరికీ పని జరుగుతుందని చెప్పుకుంటున్నారు. బిఆర్‌ఎస్ మాత్రం ఇచ్చిన హామీలు కాంగ్రెస్ నెరవేర్చడం లేదని వ్యతిరేక ప్రచారం చేస్తుంటే వారి ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు సలహాలతో కూడిన కార్యక్రమాలను చేద్దామని కాంగ్రెస్ శ్రేణులు ఉన్నా కూడా ముందుకు నడిపించే నేత లేడని వారిలో చర్చ మొదలైంది. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించి కరీంనగర్‌కు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.

కోల తిరుపతి,
(ఉమ్మడి కరీంనగర్ బ్యూరో)
(94414 41058)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News