Friday, June 6, 2025

బెంగళూరు తొక్కిసలాట ఘటన.. మృతులకు రూ.10 లక్షల నష్టపరిహారం

- Advertisement -
- Advertisement -

తొలిసారి ఐపిఎల్ కప్ సాధించిన ఆర్సిబి జట్టు బెంగళూరులో నిర్వహించిన విక్టరీ పరేడ్ తీవ్ర విషాదాన్ని నింపింది. భారీగా తరలిరావడంతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు సిఎం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ.. “ఊహించని రీతిలో అభిమానులు తరలివచ్చారు. దాదాపు 3 లక్షల మంది రావడంతోనే తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు మొత్తం 11 మంది మరణించారు. మరో 33 మందికి గాయాలయ్యాయి. వారందరికీ వైద్య చికిత్స అందుతోంది” అని చెప్పారు. ఇప్పటికే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సిఎం పరామర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News