హైదరాబాద్: ఇంగ్లాండ్తో టీమిండియా టెస్టు మ్యాచ్లు ఆడనున్న నేపథ్యంలో కరుణ్ నాయర్ పునరాగమనంపై భారత జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించారు. దేశవాళీలో అద్భుత ప్రదర్శన చేసి టీమిండియాలోకి వచ్చారని ప్రశంసించారు. ఇంగ్లాండ్ టూర్లో కరుణ్ అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ ఆడడంతో ఇక్కడి పరిస్థితులపై కరుణ్కు మంచి అవగాహన ఉందని, ఈ టూర్లో అతడు కీలకం కానున్నాడని కొనియాడారు.
కరుణ్ నాయర్ అనుభవం టీమీండియాలో ఎంతో మేలు చేస్తుందని స్పష్టం చేశారు. 2017లో టీమిండియా తరుపున అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడని, మళ్లీ ఇప్పుడు జట్టులోకి వచ్చారని పేర్కొన్నారు. యువ క్రికెటర్లకు ఒకటే చెబుతున్నానని, అత్యున్నత ప్రదర్శన చేస్తే జట్టులోకి వస్తారని, టీమిండియా తలుపులు తెరిచి ఉంటాయని గంభీర్ వివరించారు. ఒకటి రెండు మ్యాచ్లు చూసి తాము అభిప్రాయానికి రావడంలేదని, నిలకడగా పరుగులు సాధిస్తేనే జాతీయ జట్టులో చోటు దక్కుతుందన్నారు.
రంజీ ట్రోఫీలో 863 పరుగులు, విజయ్ హజారే ట్రోఫీలోనే 779 పరుగులు, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 255 పరుగులు చేసి మంచి ఫామ్లో ఉన్నారు. మూడు ట్రోఫీల్లో తొమ్మిది సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలు చేసి మంచి ఫామ్ లో ఉన్నాడు.