- Advertisement -
బాలీవుడ్ నటి కత్రినాకైఫ్ను మాల్దీవులు తన గ్లోబల్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. ఈ విషయాన్ని మాల్దీవ్స్ మార్కెటింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేషన్ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ నియామకంపై కత్రినా కైఫ్ ఆనందం వ్యక్తం చేశారు. మాల్దీవులు ఒక అందమైన స్వర్గధామంలాంటిది. ప్రకృతి, ప్రఖ్యాతి, ప్రశాంతత కలబోతగా కనిపించే ఈ దేశాన్నికి ప్రాతినిధ్యం వహించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఇక పర్యాటకులను ఆకర్షించేందుకు విజిట్ మాల్దీవ్స్ పేరుతో ప్రత్యేక సమ్మర్ సేల్ ప్రచారాన్ని తాజాగా ప్రారంభించింది. ఇందులోభాగంగానే కత్రినా కైఫ్ మాల్దీవుల రాయబారిగా ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈ ప్రకటన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాల్దీవుల పర్యటనకు నెల రోజుల ముందు రావడం విశేషం.
- Advertisement -