- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ ప్రజల గొంతుక జాగృతి సంస్థ అని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. శనివారం బంజారాహిల్స్ తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ జాగృతి ప్రారంభించి 18 ఏళ్ల అయిందని.. మాజీ సిఎం, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్, ఆచార్య జయశంకర్ స్పూర్తితోనే తెలంగాణ జాగృతి సంస్థ పుట్టిందని చెప్పారు. యూఎస్ నుంచి వచ్చాక జయశంకర్ మాకు మార్గదర్శనం చేశారని తెలిపారు. ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నా.. ఏదో కొంత గ్యాప్ ఉందని… ఆ గ్యాప్ను ఫిల్ చేయాలని జయశంకర్ తనకు సూచించారని ఆమె అన్నారు. మేము చేసిన ఉద్యమాల వల్ల చాలా జీవోలు వచ్చాయని కవిత చెప్పారు. కాగా, ఇందిరాపార్క్ వద్ద ఉన్న తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని మూసివేసి.. బంజారాహిల్స్లోని తన ఇంటి సమీపంలోనే కవిత కొత్త ఆఫీస్ ను ప్రారంభించారు.
- Advertisement -