- Advertisement -
హైదరాబాద్: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) కెసిఆర్ కుటుంబాన్ని విమర్శించారు. సొంత కుటుంబ సభ్యులు ఒకరి గొంతు ఒకరు కోసుకుంటున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చేందుకే ఇలాంటి కుతంత్రాలకు తెర తీశారంటూ మండిపడ్డారు. కెసిఆర్ కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు నమ్మరని అన్నారు. సొంత కుటుంబాన్ని మేనేజ్ చేసుకోలేని వ్యక్తి కెసిఆర్ తెలంగాణను ఎలా పాలిస్తారా? అని ప్రశ్నించారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, ఎమ్మెల్సి కవిత ప్రజలకు కొత్త సినిమా చూపిస్తున్నారని శ్రీనివాస్ రెడ్డి ఎద్దేవా చేశారు.
- Advertisement -