- Advertisement -
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యారు. కమిషన్ చీఫ్ పిసి ఘోష్ కెసిఆర్ను విచారిస్తున్నప్పుడు ఆరోగ్యం సరిగాలేదని కమిషన్కు ఆయన తెలిపారు. బహిరంగ విచారణ కాకుండా..
వ్యక్తిగతంగా విచారించాలని చంద్రశేఖర్ రావు కోరడంతో కాళేశ్వరం కమిషన్ అంగీకరించింది. కమిషన్ హాల్లో కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. హాల్లో కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్, కమిషన్ కార్యదర్శి మురళీధర్, కెసిఆర్ మాత్రమే ఉన్నారు. కెసిఆర్ తో ముఖాముఖి విచారణ కొనసాగుతుంది. బిఆర్ కె భవన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆందోళన చేస్తున్న బిఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. పోలీసులకు, బిఆర్ఎస్ కార్యక్తరల మధ్య తోపులాట జరిగింది.
- Advertisement -