Friday, June 13, 2025

కాళేశ్వరం కమిషన్ ఎదుట ముగిసిన కెసిఆర్ విచారణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్‌ (Kaleshwaram Commission)  ఎదుట మాజీ సిఎం, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌ (KCR) ముగిసింది. దాదాపు 50 నిమిషాల పాటు విచారణ కొనసాగింది. విచారణలో భాగంగా కమిషన్‌ చైర్మన్‌ పీసీ ఘోష్‌ కెసిఆర్‌ను ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణంపై కమిషన్ అడిగిన ప్రశ్నలకు కేసీఆర్‌ సమాధానం ఇచ్చారు. ఆనకట్టల నిర్మాణ నిర్ణయం ఎవరిదని కమిషన్ కెసిఆర్‌ను ప్రశ్నించింది. ఆ తర్వాత రీఇంజినీరింగ్‌ గురించి కమిషన్‌కు కేసీఆర్‌ వివరించారు. అందుకు కేబినెట్‌ ఆమోదం ఉందా అని కమిషన్‌ అడిగగా.. కేబినెట్, ప్రభుత్వ ఆమోదంతోనే నిర్మించామని కెసిఆర్ స్పష్టం చేశారు. ప్రాజెక్టుకు సంబంధించి అన్ని అనుమతులు తీసుకున్నామని కెసిఆర్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన పుస్తకాన్ని.. కమిషన్‌ చైర్మన్‌ పీసీ ఘోష్‌కు అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News