Friday, June 6, 2025

కాళేశ్వరం కమిషన్ విచారణ..9న హరీష్ రావు, 11న కెసిఆర్ హాజరు

- Advertisement -
- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతలోపాలు, అవినీతి ఆరోపణలపై జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం కమిషన్ శుక్రవారం నుంచి రాజకీయ ప్రతినిధులను విచారించనున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, డిజైన్, నాణ్యత ప్రమాణాలు, ఆర్థిక అంశాలు వంటి వాటిపై కమిషన్ ఇప్పటికే నీటిపారుదల శాఖ ఇంజినీర్లను, రిటైర్డ్ ఇంజినీర్లను, నిర్మాణ సంస్థల ప్రతినిధుల నుంచి అఫిడవిట్లను స్వీకరించి వాటి ఆధారంగా జస్టిస్ పిసి ఘోష్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన సంగతి తెలిసిందే.

విచారణలో భాగంగా కంట్రోలర్ అండ్ అడిటర్ జనరల్(కాగ్), నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డిఎస్‌ఎ) నివేదికలను కూడా కమిషన్ పరిగణలోకి తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఆర్ధిక మంత్రిగా వ్యవహరించిన ఈటల రాజేందర్‌ను శుక్రవారం కమిషన్ ముందు హాజరుకానున్నారు. ఈనెల 9వ తేదీ సోమవారం రోజున నీటిపారుదల శాఖ మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు కమిషన్ ముందుకు రానున్నారు. ఈనెల 11వ తేదీ బుధవారం రోజున మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కూడా కమిషన్ విచారించనున్నది. రాజకీయప్రతినిధుల విచారణలు తదుపరి కమిషన్ తుది నివేదికను ఈనెలాఖరులోగా ప్రభుత్వానికి అందజేస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News