గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం జస్టీస్ పిసి ఘోష్ ఆధ్వర్యంలో కమిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంజినీర్లను, అధికారులను కమిషన్ విచారించింది. ఇప్పుడు మాజీ సిఎం కెసిఆర్ ను విచారించేందుకు ఘోష్ కమిషన్ సిద్ధమైంది. ఈ క్రమంలో జూన్ 5న విచారణకు హాజరుకావాలని కెసిఆర్ కు నోటీసులు ఇచ్చింది. అనంతరం మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుతో ఎర్రవల్లి ఫామ్ హౌజ్ లో పలుమార్లు చర్చించిన కెసిఆర్.. విచారణకు హాజరయ్యేందుకు నిర్ణయించుకున్నారు. అయితే, ఈనెల 5న కాకుండా 11న కాళేశ్వరం కమిషన్ ఎదుట కెసిఆర్ విచారణకు హాజరుకానున్నట్లు సమాచారం. కెసిఆర్ విజ్ఞప్తి మేరకు ఘోష్ కమిషన్ ఈనెల 11న విచారించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. కెసిఆర్ తర్వాత హరీశ్ రావు, బిజెపి ఎంపి ఈటల రాజేందర్ ను కూడా కమిషన్ విచారించనుంది. వీరికి ఇప్పటికే నోటీసులు అందజేసింది.
కాళేశ్వరం కమిషన్ కు కెసిఆర్ విజ్ఞప్తి.. విచారణ తేదీ మార్పు
- Advertisement -
- Advertisement -
- Advertisement -