Friday, June 27, 2025

ఇజ్రాయెల్‌పై విజయం సాధించాం: ఇరాన్ సుప్రీం లీడర్

- Advertisement -
- Advertisement -

టెహ్రాన్: ఇజ్రాయెల్‌పై ఇరాన్ విజయం సాధించిందని ఆ దేశ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ప్రకటించాడు. 12 రోజులుగా ఇరు దేశాల మద్య భీకర వైమానికి దాడులు జరిగిన సంగతి తెలిసిందే. తర్వాత ఇజ్రాయెల్-ఇరాన్ ఇరుదేశాలు యుద్ధాన్ని విరమించుకున్నాయి. ఈ యుద్ధంపై అలీ ఖమేనీ గురువారం సోషల్ మీడియాలో స్పందిస్తూ..ఇరాన్ ఇజ్రాయెల్‌పై విజయం సాధించిందని అన్నారు. “ఇరాన్ అమెరికా పాలనపై సాధించిన విజయానికి నా అభినందనలు. జియోనిస్ట్ పాలన పూర్తిగా నాశనం అవుతుందని భావించి అమెరికా నేరుగా యుద్ధంలోకి దిగింది. జియోనిస్ట్ పాలనను కాపాడే ప్రయత్నంలో అది యుద్ధంలోకి దిగింది కానీ, ఏమీ సాధించలేదు” అని ఖమేనీ పేర్కొన్నారు.

కాగా, తొలుత ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయోల్, ఇరాన్ పై వైమానిక దాడులు చేసింది. దీంతో ప్రతీకార చర్యగా ఇరాన్, ఇజ్రాయోల్ పై పెద్ద ఎత్తున క్షిపణులతో దాడులకు దిగింది. ఈ క్రమంలో ఇజ్రాయోల్, ఇరాన్ క్షిపణులను అడ్డుకుంటూనే.. ఆ దేశ రాజధాని టెహ్రాన్, వైమానిక స్థావరాలే లక్ష్యంగా బాంబులతో విరుచుకుపడింది. దీంతో ఇరాన్ లో పెద్ద ఎత్తున భవనాలు, సైనిక స్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇరాన్ కూడా ఇజ్రాయోల్ రాజధాని దాడి చేసింది. ఈక్రమంలో ఇరు దేశాల మధ్య వైమానిక దాడులు తీవ్రతరం అయ్యాయి. ఈ దాడులల్లో ఇరాన్ లో దాదాపు 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. ఇజ్రాయోల్ లో పదుల సంఖ్యలో పౌరులు మరణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News