డల్లాస్: వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం కీరన్ పొలార్డ్ (Kieron Pollard) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ కరేబియన్ ప్లేయర్కి స్వదేశంలోనే కాదు.. భారత్లో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. అయితే ఇప్పుడు పొలార్డ్ క్రికెట్ చరిత్రలో ఎవరు సాధించని ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కెరీర్లో 700 టీ-20 మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా పొలార్డ్ చరిత్ర సృష్టించాడు.
పొలార్డ్ (Kieron Pollard) ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్.లో ఎంఐ న్యూయార్క్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ లీగ్లో భాగంగా మంగళవారం శాన్ ఫ్రాన్సిస్కో వేదికగా జరిగిన మ్యాచ్తో 700 మ్యాచులు ఆడిన అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 2006లో ట్రినిడాడ్ అండ్ టొబాగ్ తరఫున టి-20 క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇక పొలార్డ్ తన కెరీర్లో 700 టి-20ల్లో 13,634 పరుగులు చేయగా, బౌలింగ్లో 326 వికెట్లు పడగొట్టాడు.
వెస్టిండీస్తో పాటు, ఐపిఎస్ సిపిఎల్, బిబిఎల్, బిపిఎల్, అబుదాబి టి-20, టి-10 ఫ్రాంచైజీల తరఫున క్రికెట్ ఆడాడు. ఐపిఎల్లో 2010 నుంచి 2022 వరకూ ముంబై ఇండియన్స్ తరుఫున ఆడాడు. 2023 ఐపిఎల్ సీజన్కి ముందు రిటైర్మెంట్ ప్రకటించి.. ముంబై ఇండియన్స్ కోచింగ్ స్టాఫ్లో చేరాడు. ఇక అత్యధిక టి-20లు ఆడిన జాబితాలో పొలార్డ్ తర్వాత డ్వైన్ బ్రావో (582), షోయబ్ మాలిక్ (557) ఉన్నారు.