Tuesday, June 17, 2025

బనకచర్లపై నిర్ణయం తీసుకోలేదు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్ర భుత్వం బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఎ టువంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, బిజెపి రాష్ట్ర అ ధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టుపై సమర్పించిన ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్ట్ (పీఎఫ్‌ఆర్)ను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉందని చెప్పారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర కా ర్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ బనకచర్లపై తెలంగాణ నుంచి లేవనెత్తిన అంశంపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఒక నివేదిక కేంద్ర
జలశక్తి మంత్రిత్వశాఖకు, సెంట్రల్ వాటర్ కమిషన్‌కు ఇచ్చిందని తెలిపారు. జల ఒప్పందాలపై విధానాలు, నిబంధనలు, నదులపై ఉన్న మార్గదర్శకాలు, అనేక రాష్ట్రాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుrtకున్న తర్వాతే సెంట్రల్ వాటర్ కమిషన్ సమగ్రంగా పరిశీలన జరుపుతుందని వెల్లడించారు. సెంట్రల్ వాటర్ కమిషన్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నివేదిక కేంద్ర ప్రభుత్వానికి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.

అయితే కొంతమంది దుందుడుకు విధానంతో కేంద్రమంత్రులు ఏం చేస్తున్నారంటూ బీజేపీపై విమర్శలు చేయడం సమంజసం కాదని తెలిపారు. ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎటువంటి సమాచార మార్పిడి జరగలేదని, ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించుకోవాల్సిన అవసరం ఉందని కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభిస్తున్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ -రెండు తెలుగు రాష్ట్రాల్లో గుణాత్మక మార్పు వచ్చిందని చెబుతూ భేషజాలు లేవు, బేసిన్ల గొడవ లేదు, అపోహలు లేవు, వివాదాలు అక్కర్లేదు, వివాదాలే కావాలంటే మరో తరానికి కూడా మనం నీళ్లు ఇవ్వలేము’ అని అన్న సంగతిని గుర్తు చేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ నుంచి మూడు టీఎంసీల నీరు తన్నుకుపోతున్న సమయంలో కేసీఆర్ ఫాంహౌస్‌లో ఉండి స్పందించలేదని అన్నారు. కాళేశ్వరం విషయంలో అప్పుడు, ఇప్పుడూ బీజేపీ ఒకే మాట చెబుతోందని కిషన్‌రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో దోపిడీ జరిగిందని, ఆర్థికంగా, సాంకేతికంగా ఈ ప్రాజెక్టు సాధ్యసాధ్యాల పరంగా అనేక అనుమానాలు ఉన్నాయని తెలంగాణ ఇరిగేషన్ రంగానికి చెందిన నిపుణులు అప్పుడే చెప్పారని అన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా కాళేశ్వరం అవినీతిపై సీబీఐ దర్యాప్తు కోరాం, ఇప్పుడు కూడా అదే డిమాండ్ చేస్తున్నామని కిషన్‌రెడ్డి వెల్లడించారు.

42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి
గడచిన ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం 42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సిన షెడ్యూల్ ఇప్పటికే దాటిపోయి చాలా ఆలస్యం అయ్యిందని తక్షణమే ఎన్నికల నోటిఫకేషన్ జారీ చేసి ఎన్నికలు నిర్వహించాలని కోరారు. తెలంగాణలో పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికలు త్వరలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన నేపధ్యంలో ప్రజాస్వామ్యస్ఫూర్తికి అనుగుణంగా ఈ ఎన్నికలను నిర్వహించాలని బిజెపి డిమాండ్ చేస్తోందని అన్నారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను ముందుగానే ప్రకటించి, పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు సరైన అవగాహనతో ఎన్నికల్లో పాల్గొనేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి స్వతంత్రంగా, సంపూర్ణంగా పాల్గొని అన్ని స్థానాల్లో కూడా పోటీ చేస్తుందని పునరుద్ఘాటించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నూతన యువతను స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేలా ప్రోత్సహిస్తామని తెలిపారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశాం
ఫోన్ ట్యాపింగ్ కేసులో సమగ్ర విచారణ జరిగి దోషులకు శిక్షపడేలా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ బీజేపీ తరఫున రాష్ట్రహైకోర్టులో పిటిషన్ వేశామని కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా హైకోర్టు తీర్పు వస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో జరిగిన ప్రజావ్యతిరేక చర్యలపై సీబీఐ విచారణ జరపాలని సుద్దపూసలా మాట్లాడుతూ ఉత్తరం రాసిందని గుర్తు చేస్తూ మరి ఇప్పుడు ఆ మాటలు ఎటుపోయాయని కేంద్రమంత్రి ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీబీఐ విచారణ ఎందుకు అడగటం లేదని నిలదీశారు. గత ప్రభుత్వం హైకోర్టుకు సూచించినట్లు న్యాయవాదుల ఫోన్లు, అనేక మంది వ్యాపారస్తులు, సినిమా నటులు, ఇతర ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయని తెలిపారు. చివరకు నాతో పాటు బీజేపీ ఆఫీసులో పనిచేసే సిబ్బంది, బీజేపీ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో పేర్కొందని అన్నారు. ఈ పరిస్థితిలో వాస్తవాలను విచారించేందుకు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని హైకోర్టును ఆశ్రయించామని వివరించారు.

కేంద్ర జనగణన 2027 మార్చి 1 నాటికి పూర్తి
కేంద్ర ప్రభుత్వం 16 ఏళ్ల తర్వాత చేపట్టనున్న ఈ జనగణన 2027 మార్చి 1 నాటికి పూర్తవుతుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. దేశంలో జనగణనతో పాటే కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. జనగణన కోసం 34 లక్షల గణకులు, సూపర్వైజర్లు, 1.34 లక్ష మంది సిబ్బంది పనిచేస్తారని చెప్పారు. ఈసారి జనాభా లెక్కల సేకరణ పూర్తిగా డిజిటల్ విధానంలో ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి వ్యక్తి వివరాలు భద్రంగా ఉండేలా అనువైన యాప్ రూపకల్పన జరుగుతోందని ఆయన తెలిపారు. స్వాతంత్య్రం వచ్చాక మొదటిసారి బీసీ జనాభా లెక్కల సేకరణ కేంద్రం ఆధ్వర్యంలో జరుగుతోందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News