Sunday, June 1, 2025

అది ఫ్యామిలీ డ్రామా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ వ్యవహారంపై కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ మొ త్తం వ్యవహారాన్ని కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత సమస్యగా అభివర్ణించారు. ఈ వ్యవహారంతో బీజేపీకి ఎలాంటి సం బంధం లేదని ఆయన స్పష్టం చేశారు. కవిత చుట్టూ నెలకొన్న వివాదాలపై ఆయన వ్యాఖ్యానిస్తూ ‘ఇది పూర్తిగా డాడీ.. డాటర్, సిస్టర్.. బ్ర దర్ మధ్య నడుస్తున్న సమస్య అని అన్నారు. వారి కుటుంబానికి సంబంధించిన వ్యవహారంలో, వాళ్లు ఆడుతున్న డ్రామాలో బీజేపీ భాగస్వామి కాదని, కాబోదని స్పష్టం  చేశారు. ఈ అంశంపై బీజేపీ నాయకులు ఎవరూ స్పందించవద్దని కీలక సూచన చేశారు. తెలంగాణ ప్రజానీకానికి సైతం ఈ వివాదంతో ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు చర్చలు జరుగుతున్నాయన్న ప్రచారంపై కూడా ఆయన తీవ్రంగా మండిపడ్డారు. అసలు ఎవరు ఎవరితో చర్చలు జరిపారో బహిరంగంగా వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి నిరాధార ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని హితవు పలికారు.

సైన్యం విజయాలను రేవంత్ తక్కువ చేసి మాట్లాడటం దురదృష్టకరం
భారత సైన్యం సాధించిన విజయాలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్కువ చేసి మాట్లాడటం అత్యంత దురదృష్టకరమని కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ జైహింద్ ర్యాలీ, సభల పేరుతో దేశ సైనికులను అవమానిస్తోందని మండిపడ్డారు. దేశమంతా గర్వపడే సైనిక చర్యలను ఒక పార్టీకి ఆపాదించడం ఎంతమాత్రం సరికాదని హితవు పలికారు. సైన్యం సాధించిన విజయాలను దేశ ప్రజలందరూ పండుగలా జరుపుకుంటుంటే, రేవంత్ రెడ్డికి మాత్రం అవి బీజేపీ కార్యక్రమాలుగా కనిపించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ‘మన ఎంపీలు పార్టీలకు అతీతంగా ప్రపంచ దేశాల్లో పర్యటిస్తున్నారని, ’ఆపరేషన్ సిందూర్’ వంటివి ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో వివరిస్తున్నారని అన్నారు. పీఓకేను పాకిస్థాన్‌కు అప్పగించింది ఎవరని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ వైఖరి వల్లే పీఓకే అంశం ఇప్పటికీ రావణకాష్టంలా రగులుతూనే ఉందని ఆయన ఆరోపించారు.

గతంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడినప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు కేవలం సంతాప ప్రకటనలతో సరిపుచ్చాయని కిషన్ రెడ్డి విమర్శించారు. కానీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం అలా వ్యవహరించలేదని, పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించి మరీ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిందని గుర్తు చేశారు. ‘పహల్గామ్ దాడి అనంతరం పాకిస్థాన్‌కు ఎలాంటి నరకాన్ని చూపించామో యావత్ ప్రపంచం చూసిందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దేశ భద్రత, సైనిక చర్యల విషయంలో రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు. రాహుల్ గాంధీ ఆపరేషన్ సిందూర్‌కు ముందు పాకిస్తాన్‌కు సమాచారం ఇచ్చారని, దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పాక్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇక రేవంత్ రెడ్డి మోడీ ట్రంప్ ఒత్తిడితో యుద్ధం ఆపారని, పీవోకే తీసుకునే శక్తి బీజేపీకి లేదని అనడం సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News