Saturday, June 28, 2025

ఎపిలో 3వ షోరూమ్‌ను ప్రారంభించిన కిస్నా డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ

- Advertisement -
- Advertisement -

విజయవాడ: కిస్నా డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ , సిద్ధార్థ నగర్‌లో తమ ఎక్స్ క్లూజివ్ షోరూమ్‌ను ఘనంగా ప్రారంభించినట్లు వెల్లడించింది. ఇది ఆంధ్రప్రదేశ్ లో సంస్థకు 3వ షో రూమ్. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హరి కృష్ణ గ్రూప్ వ్యవస్థాపకుడు & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఘనశ్యామ్ ధోలాకియా పాల్గొన్నారు. అత్యంత శుభప్రదమైన రథయాత్ర వేళ జరిగిన ఈ ప్రారంభోత్సవాన్ని వేడుక జరుపుకోవడానికి కిస్నా తమ వజ్రాభరణాల మేకింగ్ ఛార్జీలపై 100% వరకు తగ్గింపు మరియు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలపై 25% వరకు తగ్గింపును అందిస్తుంది. వీటితో పాటుగా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులపై అదనంగా 5% తక్షణ తగ్గింపును కూడా అందిస్తోంది.

హరి కృష్ణ గ్రూప్ వ్యవస్థాపకులు & మేనేజింగ్ డైరెక్టర్ ఘనశ్యామ్ ధోలాకియా మాట్లాడుతూ “దక్షిణ భారతదేశంలో అధిక అవకాశాలు కలిగిన మార్కెట్ లలో విజయవాడ ఒకటి. ఈ షోరూమ్ మా వాణిజ్య కార్యకలాపాలను మరింత విస్తృతం చేయనుంది. అదే సమయంలో ప్రాంతీయ కేంద్రీకృత, వినియోగదారుల-ఆధారిత విధానం ద్వారా వ్యాపార అవకాశాలను తెరుస్తోంది. ఇది మా లక్ష్యమైన ‘హర్ ఘర్ కిస్నా’ కు అనుగుణంగా ఉంటుంది. భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆభరణాల బ్రాండ్‌గా ఉండాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోన్న మేము, వజ్రాల ఆభరణాలను సొంతం చేసుకోవాలనే ప్రతి మహిళ కలను నిజం చేస్తున్నాము ’’ అని అన్నారు.

కిస్నా డైరెక్టర్ పరాగ్ షా మాట్లాడుతూ “విజయవాడ లో మా షో రూమ్ ప్రారంభంతో, ఆంధ్రప్రదేశ్‌లో మా కార్యకలాపాలను విస్తృతం చేసుకుంటున్నాము, ఇది రోజువారీ ధారణ మరియు ప్రత్యేక సందర్భాలు రెండింటికీ అనువైన రీతిలో ప్రాంతీయ అభిరుచులను ప్రతిబింబించే ఆభరణాలను అందిస్తుంది. సాంప్రదాయ నుండి సమకాలీన శైలుల వరకు, అందరికీ ఏదో ఒకటి ఈ షోరూమ్‌లో లభిస్తుంది. ఇది ఈ ప్రాంతంలోని ఆభరణాల కొనుగోలుదారులకు అసలైన గమ్యస్థానంగా మారుతుంది..” అని అన్నారు.

ఫ్రాంచైజ్ భాగస్వాములు జి సుధాకర్ & బి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ “కిస్నా యొక్క విశ్వసనీయ బ్రాండ్ కార్యకలాపాలు , స్థానిక మార్కెట్‌పై మా అవగాహనతో , ఈ షోరూమ్ ఆభరణాల వాణిజ్యంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పడానికి సిద్ధంగా ఉంది, సంప్రదాయం మరియు ఆధునిక శైలి రెండింటినీ ప్రతిబింబించే ఉత్పత్తులను అందిస్తుంది..” అని అన్నారు. సమాజానికి తిరిగి ఇవ్వడం పట్ల కిస్నా నిబద్ధతకు అనుగుణంగా, బ్రాండ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరాన్ని మరియు నిరుపేదలకు ఆహార పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News