లీడ్స్: ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో కెఎల్ రాహుల్ (KL Rahul) అద్భుతంగా ఆడుతున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లను ధీటుగా ఎదురుకుంటూ సెంచరీ సాధించాడు. 6 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ని ప్రారంభించిన భారత్.. ఆరంభంలోనే జైస్వాల్ (4) వికెట్ని కోల్పోయింది. ఆ తర్వాత సాయి సుదర్శన్ 30 పరుగులు చేసి వెనుదిరిగాడు. కెప్టెన్ శుభ్మాన్ గిల్ 8 పరుగుల స్వల్పస్కోర్కే పెవిలియన్ చేరాడు.
ఈ దశలో కష్టాల్లోపడ్డ జట్టుకు రిషబ్ పంత్తో కలిసి రాహుల్ (KL Rahul) అండగా నిలిచాడు. వీరిద్దరు వికెట్ని కాపాడుకుంటూ స్కోర్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో 202 బంతుల్లో 13 ఫోర్లతో రాహుల్ సెంచరీ సాధించాడు. రిషబ్ పంత్ కూడా 99 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సులతో 82 పరుగులు చేసి సెంచరీకి చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం 62 ఓవర్లు ముగిసేసరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసి 240 పరుగుల ఆధిక్యంలో ఉంది.