- Advertisement -
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐపిఎల్ లో అత్యధిక ఫోర్లు కొట్టిన ప్లేయర్ గా అరుదైన రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం ఐపిఎల్ 2025 ఫైనల్ సందర్భంగా పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోహ్లీ మూడు ఫోర్లు బాదడంతో ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకు కోహ్లీ 770 ఫోర్లు కొట్టాడు. ఇదివరకు ఈ రికార్డు శిఖర్ ధావన్(768) పేరిట ఉండేది. వీరి తర్వాత అత్యధిక ఫోర్లు కొట్టినవారి జాబితాలో ఆస్ట్రేలియా ప్లేయర్ డేవిడ్ వార్నర్(663), రోహిత్ శర్మ(640), అజింక్యా రహానె(514)లు ఉన్నారు. కాగా, పంజాబ్ తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో కోహ్లీ.. 35 బంతుల్లో 43 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.
- Advertisement -