కోల్కతా న్యాయ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. కాలేజీకి వచ్చిన బాధితురాలిని ముగ్గురు వ్యక్తులు బలవంతంగా సెక్యూరి గార్డు గదిలో తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ప్రత్యేక సిట్ దర్యాప్తు జరుపుతోంది. తాజాగా ఈ ఘటనలో ఓ కీలక విషయం బయటకు వచ్చింది. ఘటన జరిగిన రోజు.. ముందుగా కాలేజీ యూనియన్ రూంలో బాధితురాలిని కూర్చోబెట్టి తర్వాత సెక్యూరీ గదిలోకి తీసుకెళ్లి నిందితులు ఆఘాయిత్యానికి పాల్పడ్డారు. అయితే, అత్యాచారం జరిగిన రోజు పగలు మొత్తం యూనియన్ రూమ్లోనే మరో విద్యార్థిని ఉన్నట్లు తెలుస్తోంది. అత్యాచారం జరగడానికి కొద్ది సమయం ముందు ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ క్రమంలో విచారణలో భాగంగా ఆమెను కూడా సిట్ బృందం ప్రశ్నించనుంది.
కాగా, నిందితులు అత్యంత పైశాచికంగా యువతిపై 4 గంటల పాటు దారుణ రీతిలో అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు స్థానిక కస్బా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రధాన నిందితుడి కాళ్లు పట్టుకున్నా వినలేదని, పైగా ఏం ఫర్వాలేదు పెళ్లి చేసుకుంటానని వెటకారానికి దిగాడని తెలిపింది. తనకు స్నేహితుడితో పెళ్లి నిశ్చయం అయిందని, తనను వదిలిపెట్టాలని ప్రాధేయపడినా తరువాత ప్రధాన నిందితుడు మరింత రెచ్చిపోయాడని, తనకు చివరికి ఓ దశలో శ్వాస తీసుకోవడం కూడా కష్టం అయిందని ఫిర్యాదులో వాపోయింది. ఇన్హేలర్ కావాలని కోరితే కాసేపటి తర్వాత నిందితుల్లో ఒకడు తెచ్చి ఇచ్చాడని వివరించింది. సాయంత్రం నాలుగు తరువాత తాను బయటపడ్డానని తెలియచేసింది.