సొంత ఊరిలో ఉప్పొంగిన ఉదయ సముద్రం ప్రాజెక్టును చూసి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉల్లాసంగా గడుపుతూ సంబరపడిపోయారు. చాలుచాలు నా జీవితం, మన ప్రాంత రైతులకు నీళ్లు అందించగలుగుతున్న తృప్తి మాటల్లో చెప్పలేనిదని మంత్రి అన్నారు. అధికారులతో పోంగి పొర్లుతున్న నీటిని చూసిఉదయ సముద్రం ప్రాజెక్టు వద్ద సంబర పడిపోయారు. ఆ ఊరిబిడ్డగా మంత్రి సంబరపడిపోవడం గ్రామ రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,అధికారుల్లో జోష్ను నింపింది. ఇక వివరాల్లోకెళితే..నల్లగొండ నుండి హైద్రాబాద్కు వెళ్లిన రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నల్లగొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని తిరుగు ప్రయాణంలో గురువారం బ్రాహ్మణవెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్టు వద్దకు చేరుకుని ప్రాజెక్టు పనితీరుపై సమీక్షించారు.
ఈ సందర్భంగా నీటిని విడుదల చేయడంతో ప్రాజెక్టును పరిశీలించి ఆనందోత్సాహాల మధ్య కొద్దిసేపు గడుపుతూ గడిపారు. అధికారులు ఈ ప్రాజెక్టు నీరు సంపూర్ణంగా రైతులకు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకంతో బ్రాహ్మణవెల్లెంల భూసేకరణను త్వరితగతిన పూర్తి చేసి నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. రైతులు ఎలాంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. భూములు అప్పగించిన రైతులకు చెల్లింపుల్లో జాప్యం చేయవద్దని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్,ఉదయసముద్రం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బత్తుల ఉషయ్య గౌడ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.