- Advertisement -
హైదరాబాద్: వరంగల్ నుంచి భారీ అనుచరగణంతో కాంగ్రెస్ నేత కొండా మురళీ హైదరాబాద్ కు బయలుదేరారు. సుమారు 60 వాహనాల్లో మురళీ గాంధీ భవన్ కు చేరుకోనున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ ముందు ఆయన హాజరుకానున్నారు. ఈ నెల 19న కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలపై కొండాను ఎంపి మల్లురవి ఆధ్వర్యంలోని క్రమశిక్షణ కమిటీ వివరణ కోరనుంది. ఆయన ఇచ్చే వివరణపై ఉత్కంఠ కొనసాగుతుంది. మురళీ వ్యాఖ్యలతో ఇప్పటికే వరంగల్ లో కొండా మురళి ఫ్యామిలీ వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా చీలిపోయింది. రెండు వర్గాలు చీలిపోవడంతో పలుమార్లు ఒకరొకరు విమర్శలు చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ నవ్వుల పాలు అవుతోందని ఆ పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు.
- Advertisement -