- Advertisement -
కొండగట్టు: జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి పెళ్లి బృందంతో వెళ్తున్న కారు డిసిఎం ఢీకొట్టడంతో ఓ చిన్నారి మృతి చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వరుడు తీవ్రంగా గాయపడడంతో పెళ్లి ఆగిపోయింది. క్షతగాత్రులను జగిత్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పెళ్లి బృందం నాందేడ్ నుంచి హుజూరాబాద్కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -