Tuesday, September 16, 2025

బైక్ ను ఢీకొట్టిన లారీ : ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెడన బైపాస్‌లో బైక్‌ను లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు శాంతిరాజు, అజయ్‌, విజయచంద్రపాల్ గా గుర్తించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News