- Advertisement -
ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఎసిబి విచారణకు మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ హాజరయ్యారు. కొద్దిసేపటిక్రితమే ఆయన విచారణ ఎదుర్కునేందుకు ఎసిబి కార్యాలయానికి చేరుకున్నారు. అంతకుముందు నందినగర్ లో మాజీ సిఎం, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ తో కెటిఆర్ సమావేశమయ్యారు. అక్కడి నుంచి తెలంగాణ భవన్ కు చేరుకుని ఆయన మీడియాతో మాట్లాడారు. “ఈ కేసును 6 నెలల నుంచి విచారణ చేస్తున్నారు. ఏమీ తేల్చలేదు. 3 సార్లు కాదు.. 30 సార్లు పిలిచినా వస్తాను. దేనికైనా సిద్ధంగా ఉన్నాం.. అరెస్ట్ కూడా చేయొచ్చు. జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం. అక్రమ కేసులకు భయపడం. లై డిటెక్టర్కు కూడా నేను సిద్ధం. చట్టాలు, కోర్టులపై మాకు గౌరవం ఉంది” అని కెటిఆర్ అన్నారు.
- Advertisement -