ఓటుకు నోటు కేసులో ఎసిబి
విచారణను ఎదుర్కొంటున్న సిఎం
లై డిటెక్టర్ పరీక్షకు రావాలి
ఫార్ములాఈ కేసులో నేను
అందుకు సిద్ధం న్యాయమూర్తి
సమక్షంలో పరీక్ష పెడదాం
దోషులెవరో, నిర్దోషులెవరో ప్రజలే
తేలుస్తారు బిఆర్ఎస్ వర్కింగ్
ప్రెసిడెంట్ కెటిఆర్ సవాల్
మనతెలంగాణ/హైదరాబాద్ : తన పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందు కు, పరిపాలన చేతకాని సిఎం రేవంత్రెడ్డి నో టీసుల పేరుతో నాటకాలు ఆడుతున్నాడని బి ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చి, ప్రభుత్వాన్ని నడపడం చేతకాని జోకర్ ముఖ్యమం త్రి ప్రజల దృష్టి మరల్చేందుకు పూటకో వేషం వేస్తున్నారంటూ ఘాటు విమర్శలు చేశారు. రోజుకో కుట్ర చేస్తున్నారనీ, కానీ ఈ చిల్లర చే ష్టలు,పనికిరాని డ్రామాలతో ప్రతినిత్యం తెలంగాణ ప్రజల గొంతుకై పోరాడుతున్న తమను అడ్డుకోలేరని ఈ సిఎం, ఈ వైఫల్యాల కాం గ్రెస్ సర్కారు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. ఫార్ములా ఈ రేసు నిర్వహణ కోసం గ త బిఆర్ఎస్ ప్రభుత్వం హెచ్ఎండిఎ అధికారి క బ్యాంకు ఖాతా నుంచి పారదర్శకంగా, సా ధికారికంగా పంపిన 44 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఫార్ములా ఈ సంస్థ అకౌంట్లోనే ఉన్నా, వాటిని వెనక్కి రప్పించడం చేతకాని ముఖ్యమంత్రి మరోసారి ఎసిబి నోటీసులు తనకు
శుక్రవారం పంపించాడని కెటిఆర్ వెల్లడించారు. హైదరాబాద్ నగరానికి తెలంగాణకు ఎంతగానో పేరు తీసుకువచ్చిన ఫార్ములా ఈ రేసును అర్ధాంతరంగా రాజకీయ దురుద్దేశంతో రద్దు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఫార్ములా ఈ సంస్థ వద్ద ఉన్న 44 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెనక్కి తీసుకువచ్చే ప్రయత్నం ఉద్దేశాపూర్వకంగా పక్కనపెట్టి, నోటీసుల పేరుతో ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకునేందుకు కుట్ర చేశారన్నారు.తనకు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చిన, విచారణ పేరుతో సాగదీసినా ఫార్ములా ఈ అంశం సంపూర్ణ పారదర్శకంగా జరిగిందని, ఈ విషయం అందరికీ తెలుసు అని పేర్కొన్నారు. శుక్రవారం తాజాగా మరోసారి ఇదే అంశంలో ఎసిబి తనకు నోటీసు ఇచ్చిందని తెలిపిన కెటిఆర్, చట్టాలను గౌరవించే పౌరుడిగా, తప్పకుండా సోమవారం ఉదయం 10 గంటలకు ఎసిబి విచారణకు హాజరవడంతోపాటు.. విచారణకు అన్నివిధాలుగా సహకరిస్తానని తెలిపారు. పదేళ్ల క్రితం నోటుకు ఓటు కుంభకోణంలో నోట్లకట్టలున్న
నల్లబ్యాగుతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ రేవంత్ రెడ్డి కేసు కూడా ఇదే ఎసిబి పరిధిలో పెండింగ్లో ఉన్న విషయాన్ని కెటిఆర్ గుర్తు చేశారు. ఇద్దరిపై కూడా ఎసిబి కేసులున్న నేపథ్యంలో.. ఇద్దరిలో దోషులెవరో, నిర్దోషులెవరో తేల్చేందుకు జడ్జి సమక్షంలో లైవ్ టెలివిజన్ సాక్షిగా లై డిటెక్టర్ టెస్టును ఎదుర్కొనే దమ్మూ, ధైర్యం ముఖ్యమంత్రికి ఉన్నదా..? అంటూ సవాలు విసిరారు. లై డిటెక్టర్ టెస్టుకు తాను సిద్దం, రేవంత్ రెడ్డి సిద్ధమా..? అంటూ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల సాక్షిగా కెటిఆర్ ప్రశ్నించారు.