- Advertisement -
ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ దారుణంగా మోసం చేసిందని కెటిఆర్ విమర్శించారు. పింఛన్ తీసుకునే పెద్దమనుషులు ఒక్కొక్కరికి రేవంత్ రెడ్డి రూ.40 వేల చొప్పున బాకీ ఉన్నారని అన్నారు. ఆడపిల్లలకు ఐదు లక్షల భరోసా కార్డు, స్కూటీలు, నెలకు రూ.2500 ఇవ్వాల్సింది ఇవ్వలేదని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలోని ప్రతీ ఆడబిడ్డకు రేవంత్ రెడ్డి రూ.50 వేల బాకీ ఉన్నాడని అన్నారు. రాహుల్ గాంధీ ఫోటోతో గ్యారెంటీ కార్డులు ఇచ్చి ప్రజలకు కాంగ్రెస్ నాయకులు అరచేతిలో వైకుంఠం చూపించారని ధ్వజమెత్తారు. ముఖం బాగా లేక అద్దం పగలగొట్టుకున్నట్టు రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయనకు పాలన చేతగాక, సమర్థత లేక రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం చేతకాని దద్దమ్మ రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక కేసీఆర్ ను నిందిస్తున్నారని ఆరోపించారు.
- Advertisement -