- Advertisement -
హైదరాబాద్: ఫార్ములా-ఈ కేసులో మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ (KTR) ఎసిబి (ACB) విచారణ పూర్తైంది. కెటిఆర్ను సుమారు ఎనిమిది గంటలపాటు ఎసిబి అధికారులు ప్రశ్నించారు. అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. విచారణ అనంతరం కెటిఆర్ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. కెటిఆర్ రాకతో తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబురాలు జరిపారు.
కేసు విచారణలో కెటిఆర్ సెల్ఫోన్ సీజ్ చేసేందుకు ఎసిబి అధికారులు ప్రయత్నించారు. అయితే ఇవాళ విచారణకు సెల్ఫోన్ తీసుకురాలేదని కెటిఆర్ అధికారులకు తెలిపారు. ఈ-కార్ రేసింగ్ సమయంలో వాడిన సెల్ఫోన్లు అప్పగించాలని ఎసిబి అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 18లోపు సెల్ఫోన్లు అప్పగించాలని ఎసిబి అధికారులు ఆదేశించారు.
- Advertisement -