- Advertisement -
ఫార్ములా-ఈ కేసులో ఎసిబి విచారణ నేపథ్యంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్.. బిఆర్ఎస్ అధిపతి కెసిఆర్ తో సమావేశమయ్యారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఎసిబి కార్యాలయంలో కెటిఆర్ విచారణకు హాజరుకానున్నారు. ఈ క్రమంలో కొద్దిసేపటిక్రితం నందినగర్ నివాసానికి చేరుకున్న కెటిఆర్.. కెసిఆర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫార్ములా-ఈ కేసు ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది. నందినగర్ నుంచి తెలంగాణ భవన్ కు అక్కడి నుంచి కెటిఆర్ ఎసిబి ఆఫీసుకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎసిబి కార్యాలయం దగ్గర బారికేడ్లు ఉంచారు. మరోవైపు, తెలంగాణ భవన్ కు భారీగా పార్టీ నేతలు చేరుకుంటున్నారు. కాగా, ఈ కేసులో జనవరి 8న తొలిసారి ఎసిబి విచారణకు కెటిఆర్ హాజరైన సంగతి తెలిసిందే. రెండోసారి ఆయనను ఎసిబి విచారించేందుకు సిద్ధమైంది.
- Advertisement -