అమెరికా చట్టాలను, అక్కడి
సమాజంలో వస్తున్న మార్పులను
అర్థం చేసుకోవాలి టెక్సాస్
డల్లాస్ వర్శిటీ విద్యార్థులతో కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : అమెరికాలో వివిధ కారణాలతో ఇబ్బందులు పడే భారతీయ విద్యార్థులకు అండ గా నిలబడతామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ భరోసా ఇచ్చారు. ఎన్నో ఆశలతో ఉన్నత విద్య కోసం వ చ్చిన విద్యార్థులు, అవగాహన లేక ఏమైనా తప్పు చేస్తే వా రికి అవసరమైన న్యాయ సహాయం అందించేందుకు బిఆర్ఎస్ అమెరికా విభాగం తరపున ప్రయత్నం చేస్తామని తెలిపారు. అమెరికా వచ్చిన విద్యార్థులు ఏదైనా కారణం తో తిరిగి వస్తే ఆ విద్యార్థితో పాటు వారి కుటుంబం ఎం తో ఆవేదనకు గురి అవుతుందని పేర్కొన్నారు. అందుకే విద్యార్థులకు అండగా నిలబడేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అయితే విద్యార్థులు కూడా అమెరికా చట్టాలను, అక్కడి సమాజంలో వస్తున్న మార్పులను అ ర్థం చేసుకొని మసులుకోవాలని సూచించారు. స్థానిక చ ట్టాలతో పాటు ఇక్కడి పరిస్థితులను ప్రతీ ఒక్క విద్యార్థి అ వగాహన చేసుకోవాలని తెలిపారు. అమెరికాలోని యూ నివర్సిటీ ఆఫ్ టెక్సాస్ డల్లాస్లో చదువుకుంటున్న విద్యార్థులతో కెటిఆర్ మాట్లాడారు.
ఈ సందర్భంగా ప లువు రు యూనివర్సిటీ విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నల కు స మాధానాలు ఇచ్చారు. అమెరికా వెళ్లాలన్నా.. చదువుకోవాలన్నా ఎన్నో వ్యయ, ప్రయాసలకు గురయ్యే వా ళ్ళమని, ప్రపంచం వేగంగా మారిపోయి ఇప్పుడు అనేక సౌ కర్యాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. దాం తోపాటే అమెరికా విద్య కూడా అనేక మందికి అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. కేవలం ర్యాంకుల కోసమో, గ్రేడ్ల కోసమో కాకుండా జీవితంలో సాధించాల్సిన ప్రధా న లక్ష్యాల పైన దృష్టి పెట్టాలని సూచించారు. చూస్తుండగానే మనిషి జీవితంలో 50 సంవత్సరాలు పూర్తి అవుతాయని ఇంత స్వల్ప కాలంలోనే తమ కలలు, ఆకాంక్షలను అందిపుచ్చుకోవాలని అన్నారు. లక్ష్యం వైపు సాగే క్రమం లో అవరోధాలు ఎదురైనా, మనతోనే ఉన్న వ్యక్తులు వె నక్కి లాగినా నిబద్ధతతో ముందుకు పోవాలని పేర్కొన్నా రు. కేవలం ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా సమాజంలో ప్రపంచంలో మంచి మార్పు తీసుకువచ్చే దిశగా ప్రయత్నం చేయాలని తెలిపారు.
నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలి
ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఆవిష్కరణలు వస్తున్నాయని, ఇన్నోవేషన్ రంగంలో ప్రపంచ దేశాలతో ఇండియా పోటీపడి రాణించాల్సిన అవసరం ఉందని కెటిఆర్ వ్యాఖ్యానించారు. అమెరికాలోని ఉన్నత విద్యా సంస్థల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు నూతన ఆవిష్కరణలపై దృ ష్టి సారించాలని అన్నారు. రిస్కు తీసుకున్నప్పుడు మాత్ర మే కలలు సాకారం అవుతాయి అనడానికి కెసిఆర్ జీవితమే సాక్ష్యమని పేర్కొన్నారు. రాజకీయాల్లో చిన్న వయసుగా పరిగణించే నాలుగు పదుల వయసులో పదవులను త్యాగం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం మొదలుపెట్టిన రోజు అనేకమంది ఆయనను అవహేళన చేశారని చెప్పారు. కానీ 14 సంవత్సరాల నిరంతర పోరా టం తర్వాత ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నప్పుడు సమాజంలోని ప్రతి ఒక్కరు కెసిఆర్పై ప్రశంసల కురిపించారని అన్నారు.అమెరికాలో చదువుకుని ఇండియాకి తిరిగి వ చ్చి కంపెనీలు ప్రారంభించాలని కెటిఆర్ విద్యార్థులను కోరారు. మనదేశంలో ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ అనేక అవకాశాలు కూడా ఉన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. బ్రెయిన్ బ్రెయిన్(మేథోవలస) మన దేశానికి పె ను సవాలుగా మారిందని చెప్పారు. దేశాభివృద్ధిలో, తె లంగాణ అభివృద్ధిలో విదేశాల్లో చదువుకుంటున్న యువ త భాగం కావాలని కెటిఆర్ పిలుపునిచ్చారు.