Thursday, August 14, 2025

రేవంత్ రెడ్డి ప్రభుత్వ పతనం దగ్గరలోనే ఉంది:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ.. ప్రజల పక్షాన పోరాడుతున్న బిఆర్‌ఎస్ పార్టీ నాయకులపై కర్కశంగా విరుచుకుపడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ పతనం దగ్గరలోనే ఉందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. పోడు భూముల పట్టాల కోసం ఉద్యమిస్తున్న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని దిందా రైతన్నలకు మద్దతుగా నిలిచిన బిఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ సహా ఇతర నేతలను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని కెటిఆర్ తీవ్రంగా ఖండించారు. రైతుల చేతులకు సంకెళ్లు వేసి.. వారి పక్షాన పోరాడుతున్న వారిని అక్రమంగా నిర్భందించడం రేవంత్ ప్రభుత్వ గుండాగిరికి నిదర్శనమని అభివర్ణించారు. పోడు రైతులను వేధించడం ఆపి.. వారికి వెంటనే పట్టాలు ఇవ్వాలని అన్నారు. కుట్రపూరిత అరెస్టులను మానుకుని కౌటాల పోలీసుల అదుపులో ఉన్న ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్‌తో సహా బిఆర్‌ఎస్ పార్టీ నేతలను తక్షణమే విడుదల చేయాలని కెటిఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News