బిఆర్ఎస్ పాలన, మోడల్ అభివృద్ధికి దిక్సూచి దేశ, విదేశాలకు ఇది
ఆదర్శం సంపద సృష్టి, సమాన పంపిణీలో దేశంలోనే తెలంగాణకు
అగ్రస్థానం గ్లోబల్ టెక్ హబ్గా హైదరాబాద్.. ఇది బిఆర్ఎస్ విజయం
మిషన్ భగీరథతో దేశంలోనే తొలిసారి కోటి ఇండ్లకు సురక్షిత మంచినీరు
అందించాం తలసరి ఆదాయంలో 12వ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని
పదేళ్లలో ప్రథమ స్థానానికి తీసుకెళ్లాం లండన్ బ్రిడ్జి ఇండియా వీక్ 2025
సదస్సులో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: ధృడ నాయక త్వం, ప్రజల జీవితాలను మార్చాలన్న చిత్తశుద్ది ఉంటే అద్భుతమైన ప్రగతి సాధ్యమని తెలంగాణ నిరూపించిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యానించారు. 9 ఏండ్ల బిఆర్ఎస్ పా లనలో తెలంగాణ సాధించిన విజయాలు దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. “స్థిరమైన వృద్ధితో ప్రపంచ ఆర్థిక రంగాన్ని నడిపించడంలో తెలంగాణ ఎందుకు ముఖ్యం..?” అనే అంశంపై లండన్ బ్రిడ్జ్ ఇండియా వీక్ 2025 సదస్సులో కెటిఆర్ ప్రధాన ఉపన్యాసం చేశారు. అభివృద్ది, సంక్షేమ రంగాల్లో విప్లవాత్మక పంథాను అనుసరించి వివిధ రంగాల్లో తీసుకొచ్చిన మార్పు లు, పాలసీలపై తన అనుభవాలు, ఆలోచనలను కెటిఆర్ ఈ సదస్సులో పంచుకున్నారు. సంపదను సృష్టించడంతో పాటు దాన్ని సమాజంలోని అట్టడుగు వర్గాలకు సమానంగా పంచడమే తమ హ యాంలో తెలంగాణను దేశంలో ప్రత్యేకంగా నిలిపిందని అన్నారు. కెసిఆర్ నాయకత్వంలోని తమ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి మధ్య అద్భుత సమతుల్యత సాధించిందని తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రగతిశీల పనులు స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఎవరు చేయలేద ని చెప్పారు.
9 ఏండ్ల బిఆర్ఎస్ పాలనలో అభివృ ద్ధి కేంద్రంగా సాగిన పాలన, ఆలోచనలు ఆవిష్కరణలుగా మారిన విధానంతో పాటు తెలంగాణ వి జయ ప్రస్థానాన్ని కెటిఆర్ అద్భుతంగా వివరించారు. వివిధ దేశాల రాజకీయ నాయకులు, ప్రభావశీల వ్యక్తులు హాజరైన ఈ సదస్సులో మాట్లాడిన కెటిఆర్, తలసరి ఆదాయంలో 12వ స్థానం నుం డి మొదటి స్థానానికి ఎలా ఎదగవచ్చో తెలంగాణ నుండి భారతదేశంలోని ఇతర రాష్ట్రాలు నేర్చుకోవచ్చని అన్నారు. తమ హయాంలో పాలనను ప్రజలకు చేరువ చేయడంతో పాటు ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించి వ్యక్తుల కంటే విధానాలకే ప్రాధాన్యత ఇ చ్చామని తెలిపారు. విప్లవాత్మక మార్పులను ఆ హ్వానించడంతో పాటు నిర్ణయాధికారాన్ని వికేంద్రీకరించడమే తెలంగాణను మిగతా రాష్ట్రాల కంటే ప్రత్యేకంగా మార్చిందని చెప్పారు. ఇంజనీ రింగ్ అద్భుతంగా చెప్పుకునే చైనాలోని త్రీ గార్జియస్ డ్యామ్కు సరిసమానమైన ప్రాజెక్టు తెలంగాణలోని కాళేశ్వరం అని కెటిఆర్ పేర్కొన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద బహుళ ఎత్తిపోతల పథకం కాళేశ్వరంతో 80 మీటర్ల సముద్ర మట్టపు ఎత్తు నుంచి 600 మీటర్ల ఎత్తుకు నీళ్లను తీసుకునిపోయి ప్రతీ సీజన్కు 45 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నామని తెలిపారు. ఇండియా లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఒక ప్రాజెక్టును నిర్మించడం చాలా కష్టం అని కానీ,
తాము ప్రాజెక్టు నిర్మాణానికి కావలసిన అన్ని రకాల అనుమతులను తీసుకొని, ప్రాజెక్టుతో నష్టపోతున్న నిర్వాసితులకు సరైన పరిహారం ఇచ్చి కేవలం 3 సంవత్సరాల కాలంలోనే ప్రాజెక్టును పూర్తి చేసి దేశం మొత్తం నివ్వెరపోయేలా చేశామని చెప్పారు. ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్న ఇండియాలో ప్రతీ ఇంటికి శుద్దిచేసిన తాగునీటిని అందించడం స్వప్నంగానే ఉన్న సమయంలో, కెసిఆర్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం దేశంలోనే తొలిసారి కోటి ఇండ్లకు మిషన్ భగీరథతో సురక్షిత మంచినీటిని అందించిందని వివరించారు. దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోనూ ఉపరితల నీటి వనరులతో ప్రతీ ఇంటికి శుద్దిచేసిన తాగునీటిని ఇప్పటికీ అందించడం లేదన్నారు. తలసరి ఆదాయంలో 156 శాతం వృద్ధిని ఒక్క దశాబ్ద కాలంలోనే దేశంలో తెలంగాణ రాష్ట్రం ఒక్కటే సాధించిందని అన్నారు. 2014లో తలసరి ఆదాయంలో 12వ స్థానంలో ఉన్న తెలంగాణ, ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రగతిశీల విధానాలతో 2023 నాటికి నంబర్వన్ స్థానానికి చేరుకుందని తెలిపారు.
టిఎస్ ఐపాస్తో సంక్షిష్టతను దూరం చేశాం
బిఆర్ఎస్ ప్రభుత్వ పారిశ్రామిక అనుకూల విధానాల కారణంగా గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ,ఫేస్బుక్తో పాటు ప్రపంచంలోని ప్రఖ్యాత టెక్ కంపెనీలు అమెరికా తర్వాత తమ అతిపెద్ద క్యాంపస్లను హైదరాబాదులో నెలకొల్పాయని కెటిఆర్ చెప్పారు. కార్పొరేట్ సంస్థలను హైదరాబాద్కు ఆహ్వానించి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించామన్నారు. తాము అధికారంలోకి రావడానికి ముందు 2014లో టెక్ పరిశ్రమలో మూడు లక్షల 23 వేలు ఉద్యోగాలు మాత్రమే ఉండేవి అని, తాము అధికారం నుంచి దిగిపోయే నాటికి అవి పది లక్షలకు చేరాయని పేర్కొన్నారు. అలాగే 2014లో 56 వేల కోట్ల రూపాయలుగా ఉన్న ఐటీ ఎగుమతులు, 2023 నాటికి రెండు లక్షల 41 వేల కోట్ల రూపాయలకు చేరాయని, ఇదంతా తమ పార్టీ అధినేత, మాజీ సిఎం కెసిఆర్ దార్శనికత, మార్గదర్శకత్వంతోనే సాధ్యమైందని వ్యాఖ్యానించారు. ఇండియా లాంటి వైవిధ్యభరిత దేశంలో ఒక పరిశ్రమ, సంస్థను ఏర్పాటు చేయడంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని, ఆ సంక్షిష్టతను టిఎస్ ఐపాస్తో తాము దూరం చేశామన్నారు. ఆన్లైన్లో ఎవరైనా అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటే 15 రోజుల్లో అనుమతులు వస్తాయని, ఒకవేళ రాకుంటే అనుమతులు వచ్చినట్టుగానే భావించి పరిశ్రమను ప్రారంభించుకునే విధానం అమలు చేశామని గుర్తు చేశారు. దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోనూ ఈ విధానం లేదని పేర్కొన్నారు.
టిఎస్ఐపాస్తో తమ హయాంలో 28 వేల పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామని, ఫలితంగా మూడున్నర లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయని వివరించారు. తద్వారా 24 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పన జరిగిందన్నారు. ముఖ్యమంత్రిగా కెసిఆర్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు, అమలు చేసిన వినూత్న విధానాలతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్గా ఎదిగిందని తెలిపారు. ఇండియాలో పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా కెటిఆర్ కోరారు. ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణను ఫస్ట్ ఛాయిస్గా ఎంచుకోవాలన్నారు. అపార అవకాశాలను అందించడంతో పాటు కలలను నిజం చేసుకోవాలనుకునే ప్రతీ ఒక్కరికీ తెలంగాణ లైట్ హౌజ్ లాంటిదని, ఇండియాతో పాటు ప్రపంచానికే తెలంగాణ దిక్సూచి అని పేర్కొన్నారు. తన ప్రసంగంతో తెలంగాణ సక్సెస్ జర్నీని సాధికారికంగా వివరించిన కెటిఆర్, బ్రిడ్జ్ ఇండియా సదస్సులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. సదస్సుకు హాజరైన వివిధ దేశాల రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు కెటిఆర్ ప్రసంగానికి ముగ్ధులై ఆయనను ప్రత్యేకంగా ప్రశంసించారు.