- Advertisement -
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ముందుగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కెటిఆర్ పర్యటించనున్నారు. ఈ నెల 9న జడ్చర్ల, 13న గద్వాల్లో కెటిఆర్ పర్యటిస్తారు. దసరా లోపు వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో పర్యటించాలని కెటిఆర్ సిద్ధమైనట్లు తెలిసింది.
- Advertisement -