సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న, హైలీ యాంటిసిపేటెడ్ పాన్- ఇండియా మూవీ కుబేర. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అద్భుతమైన తారాగణంతో కుబేర ఇండియన్ సినిమాలో గేమ్-ఛేంజర్గా నిలవబోతోంది. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి ఎస్విసిఎల్ఎల్పిపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్తో నిర్మిస్తున్నారు. కుబేర తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చీఫ్ గెస్ట్ గా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. ప్రీరిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి ‘కుబేర’ ట్రైలర్ ని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ “శేఖర్ కమ్ముల తన సినిమాని ట్రైలర్లోనే చెప్పేస్తారు.
కానీ కుబేర విషయానికి వస్తే నాకు ఒక సస్పెన్స్ సినిమా లాగా అనిపిస్తుంది. నాగార్జున, ధనుష్ని ఎలా కలిపిపాడు? వాళ్ళ మధ్య డ్రామా ఏంటి? అనేది చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. దీని కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాను”అని తెలిపారు. కింగ్ నాగార్జున (King Nagarjuna) మాట్లాడుతూ “ఇది కేవలం శేఖర్ కమ్ముల ఫిలిం. మేమందరం ఇందులో పాత్రలు మాత్రమే. ఆయన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి తీసిన సినిమా. మమ్మల్ని కూడా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకొచ్చాడు. మాయాబజార్ చూసినప్పుడు అది కె.వి రెడ్డి ఫిల్మ్ అంటాం. అలాగే కుబేర కూడా శేఖర్ కమ్ముల ఫిలిం. శేఖర్ కమ్ముల కోస మే ఈ సినిమా చేయడం జరిగింది”అని అన్నారు. హీరో ధనుష్ మాట్లాడుతూ “ఇది నాకు 52వ తమిళ్ సినిమా, రెండవ తెలుగు సినిమా.
శేఖర్ కమ్ముల సినిమాకి ముందే ఈ కథ నాకు చెప్పారు. నా రెండో సినిమా ఆయనతో చేయడం చాలా ఆనందం. కుబేరలో అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చినందుకు శేఖర్కి ధన్యవాదాలు”అని పేర్కొన్నారు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల మాట్లాడుతూ “ప్రతి సినిమా కూతురు లాంటిది కొడుకు లాంటిదని చెబుతుంటాను. కుబేర మాత్రం తల్లి ప్రేమ లాంటిది. బిచ్చగాడు అయినా కోటీశ్వరుడైన తల్లి ప్రేమ ఒక్కటే. అలాంటి ఐడియాలజీతో కథ రావడం అదృష్టంగా భావిస్తున్నా. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా సరస్వతి దేవి తలెత్తుకుని చూస్తుంది. ఇది చాలా కొత్త సినిమా. ఇంతకుముందు మీరు ఎప్పు డు చూడని సినిమా”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రష్మిక మందన, దేవిశ్రీప్రసాద్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, నందకిషోర్, భాస్కర్ భట్ల, తోట తరణి పాల్గొన్నారు.