సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న కాంబినేషన్లో దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన పాన్- ఇండియా మూవీ ‘కుబేర’. అద్భుతమైన తారాగణంతో కుబేర ఇండియన్ సినిమాలో గేమ్-ఛేంజర్గా నిలవబోతోంది. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి ఎస్విసిఎల్ఎల్పిపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్తో నిర్మిస్తున్నారు. కుబేర తెలుగు, తమిళం, హిం దీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుం ది. ఈ సందర్భంగా డైరెక్టర్ శేఖర్ కమ్ముల విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “ఒక సూపర్ రిచ్ ప్రపంచం, ఇంకొకటి అట్టడుగున ఉండే ప్రపంచం.. బిలినియర్ వర్సెస్ బెగ్గర్.. అది ఆసక్తికరంగా అనిపించింది. నిజానికి ఇది కథగా చెప్పడం చాలా కష్టం. చాలా పెద్ద పాయింట్.
అది మెల్లగా ఒక ఎమోషనల్ థ్రిల్లర్ తయారైంది. అక్కడ నుంచి కథ కొనసాగుతుంది. -తనకి ఏమీ వద్దు అనుకునే ఒక బెగ్గర్.. తనకి ప్రపంచంలో అన్ని కావాలనుకునే ఒక బిలినియర్.. వారి మధ్య సంఘర్షణ ఉంటే ఎలా ఉంటుందనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. – ఈమధ్యకాలంలో చాలా సినిమాలు కథలు వస్తున్నాయి కానీ ఇలాంటి ఒక కథ నేను చెప్పినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కథ తప్పకుండా చెప్పబడాలి. మంచి థ్రిల్లింగ్ పాయింట్ ఇది. -సినిమాని తెలుగు, తమిళ్ (Telugu-Tamil) రెండు భాషల్లో షూట్ చేశాం. కథాపరంగా ఎలాంటి మార్పు ఉండదు కానీ నిడివిలో ఒక నిమిషం తేడా వుంటుంది. – కొన్ని షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ నాగార్జున చేస్తే బాగుంటుంది. ఈ క్యారెక్టర్కి ఆయ న సరిగ్గా సరిపోయారు.
ఈ సినిమాలో ఆయనను ఒక విభిన్నమైన నటనతో క్యారెక్టర్కి తగ్గట్టుగా చూ పించడం జరిగింది. -నాగార్జున మనం, ఊపి రి… ఇలా చాలా చిత్రాల్లో డిఫరెంట్ వేరియేషన్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఈ సినిమా లో కూడా ఆయన చాలా కొత్తగా కనిపిస్తారు. ఈ క్యారెక్టర్లోకి ఆయన అద్భుతంగా ఇమిడిపోయారు. -రష్మిక కూడా అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది. కుబేర పాత్రని ధనుష్ తప్పితే ఎవ రూ చేయలేరు. సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ కూడా ఇదే మాట చెబుతారు. అంత అద్భుతంగా నటించారు. -ఇది ఒక డిఫరెంట్ సినిమా. నేను ఏ సినిమా తీసిన నిజాయితీగానే చేస్తాను. అది ఈ సినిమాలో పదింతలు కనిపిస్తుంది. -దేవిశ్రీ ప్రసాద్…కుబేరకి అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. మ్యూజిక్ చాలా గొప్ప అనుభూతినిస్తుంది. -ఈ సినిమా కథే ముంబయ్ బ్యాక్డ్రాప్ను కోరుకున్నది. కథాపరంగా ముంబయ్ తప్పనిసరి కాబట్టి అక్కడ సినిమా చేశాము”అని అన్నారు.