సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న లేటెస్ట్ యునినామస్ బ్లాక్ బస్టర్ శేఖర్ కమ్ముల ‘కుబేర’. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి ఎస్విసిఎల్ఎల్పి బ్యానర్పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్తో నిర్మించారు. కుబేర తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలై యునానిమస్ బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్ఫుల్ బుకింగ్స్తో సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్బస్టర్ కుబేర సక్సెస్ మీట్ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్గా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్గా జరిగింది.
బ్లాక్బస్టర్ కుబేర (Blockbuster Kubera) సక్సెస్ మీట్లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో ఓ మంచి క్యారెక్టర్ శేఖర్ రాయడం, అది నాగార్జున ఒప్పుకొని చేయడం ఇదే ఫస్ట్ సక్సెస్గా భావిస్తున్నాను. దేవ క్యారెక్టర్ లో ధనుస్ని తప్ప ఇంకెవరిని ఊహించుకోలేం. ఆ క్యారెక్టర్ చూసిన తర్వాత అలా అనిపించింది. సినిమా చూస్తున్నప్పుడు ధనుష్ని గుర్తించలేకపోయాను. అంతలా క్యారెక్టర్లో లీనమైపోయాడు’ అని అన్నారు. కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. ‘ఇది శేఖర్ కమ్ముల ఫిల్మ్. థ్రిల్లర్తో హ్యూమన్ ఎమోషన్తో సినిమా చేయడం అనేది మామూలు విషయం కాదు. అది ఈ సినిమాతో కుదిరింది. ఈ సినిమా సక్సెస్ ఆనందాన్నిచ్చింది’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శేఖర్ కమ్ముల, ధనుష్, దేవిశ్రీ ప్రసాద్, రష్మిక మందన్న, సునీల్ నారంగ్ తదితరులు పాల్గొన్నారు.