Tuesday, June 17, 2025

అప్పు చెల్లించలేదని… చెట్టుకు కట్టేసి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా కుప్పం మండలం దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళను అప్పు తీర్చలేదని లాక్కెళ్లి చెట్టుకు కట్టేసి దాడి చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… నారాయణపురం గ్రామంలో శిరీష, తిమ్మరాయప్ప అనే దంపతులు నివసిస్తున్నారు. తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద 3 సంవత్సరాల క్రితం 80,000 వేలు రూపాయలు అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చలేక భార్య శిరీష (25) బిడ్డలను గ్రామాన్ని వదిలి భర్త తిమ్మరాయప్ప ఎక్కడికో వెళ్ళిపోయాడు. కూలీ పనులు చేసుకుంటూ పిల్లలు పోషించుకుంటూ శిరీష అప్పులు తీరుస్తుంది.

సకాలంలో అప్పు చెల్లించలేదని రోడ్డుపై వెళ్తుండగా ఆమెను అసభ్యకరమైన పదజాలంతో మునికన్నప్ప దూషించాడు. తన అప్పు డబ్బులు ఇవ్వకపోతే చంపిస్తామని బెదిరింపులకు దిగాడు. ఈడ్చుకొంటూ వెళ్ళి తాడుతో బలవంతంగా వేప చెట్టుకు కట్టేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. ముని కన్నప్ప అతని భార్య వెంకటమ్మ, కొడుకు రాజా, కోడలు జగదీశ్వరి పై కేసు నమోదు చేశామని కుప్పం అర్బన్ సిఐ శంకరయ్య వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News