Friday, June 6, 2025

కొత్త పాటతో ‘లక్ష్మీనరసింహా’ రీ రిలీజ్

- Advertisement -
- Advertisement -

గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ‘లక్ష్మీ నరసింహా’ మ రోసారి థియేటర్స్‌లో అలరించడానికి వస్తోంది. జ యంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బె ల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ చిత్రం 2004లో వి డుదలై ఘన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని 4కె వర్షన్‌లో జూన్ 8న థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రీ రిలీజ్ చేస్తున్నారు. రీ రిలీజ్ వర్షన్‌లో కొ త్త పాట జత చేశారు. ‘మందేసినోడు’ అంటూ సాగే పాటని భీమ్స్ సిసిరోలియో అన్ స్టాపబుల్ వైబ్ తో కంపోజ్ చేశారు. స్వరాగ్ కీర్తన్ హై ఎనర్జీతో పాడిన ఈ సాంగ్ కి ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ మాస్ ని కట్టిపడేసే లిరిక్స్ అందించారు. రీరిలీజ్ ప్రెస్ మీట్‌లో ఈ సాంగ్‌ని గ్రాండ్‌గా లాంచ్ చేశారు.

ప్రెస్ మీట్‌లో ని ర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ “21 ఏళ్ల త ర్వాత ‘లక్ష్మీ నరసింహా’ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నానంటే నందమూరి అభిమానులకు ఏదో ఒక స్పెషల్, సర్‌ప్రైజ్ ఇవ్వాలి. ఎలాంటి సర్‌ప్రైజ్ అని ఆలోచన వచ్చినప్పుడు.. ఈ సినిమా కోసం ఒక సాంగ్ చేశాం. ఒక సాంగ్ ని షూట్ చేశాం గాని సినిమాలో లేదు. ఆ సాంగ్ ని ఎలాగైనా రీ రిలీజ్ లో యాడ్ చేయాలి అని ఆలోచన వచ్చింది. ప్రసాద్ ల్యాబ్స్‌లో నెగిటివ్ దొరికింది. కానీ సౌండ్ లేదు, కేవలం పిక్చర్ ఉంది. చంద్రబోస్, బీమ్స్ కలిసి ఈ పాటను అద్భుతంగా చేశారు. నందమూరి అభిమానులు ఈ సినిమాని మ ళ్లీ మళ్లీ చూసి పెద్ద హిట్ చేయాలని కోరుతున్నాను”అని అన్నారు.

డైరెక్టర్ జయంత్ సి.పరాన్జీ మాట్లాడు తూ “ఇలాంటి కొత్త ఐడియాలన్నీ నిర్మాత సురేష్‌కి వస్తాయి. ఆడియో లేని ఈ సాంగ్‌కి ఏదైనా చేద్దామని ఆయన అన్నప్పుడు నేను అసాధ్యం అని చెప్పాను. ఆ యన, చంద్రబోస్, భీమ్స్ కలిసి ఈ అద్భుతం చేశా రు. రీ రిలీజ్‌లో సినిమాని అందరూ చూసి ఎంజాయ్ చేయండి”అని తెలిపారు. చంద్రబోస్ మాట్లాడుతూ “నా 31 ఏళ్ల సినీ సాహిత్య ప్ర యాణంలో అతి విచిత్రమైన టువంటి విన్యాసం చేసిన పాట ఇది. నేను రాసిన పా టకి ఒక్క అక్షరం కూడా మార్చకుండా ట్యూన్ చేసి అద్భుతంగా పాటని కం పోజ్ చేశాడు బీమ్స్. ఈ పా టని బాలయ్య బాబు అ భిమానులు అందరికి అంకి తం ఇస్తున్నాం”అని చెప్పారు. మౌనిక రెడ్డి మాట్లాడుతూ “బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది.ఈ సినిమా ను అత్యధిక థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేస్తాం” అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భీమ్స్ సిసిరోలియో, అభిలాష్ రెడ్డి, స్వరాగ్ కీర్తన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News