- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో న్యాయవిద్యలో ప్రవేశాలకు శుక్రవారం నిర్వహించిన టిజి లాసెట్, పిజిఎల్సెట్ ఫలితాలు బుధవారం(జూన్ 25) విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు ఉన్నత విద్యామడలి చైర్మన్ వి.బాలకిష్టారెడ్డి, ఇతర అధికారులు లాసెట్, పిజిఎల్సెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ నెల 6వ తేదీన నిర్వహించిన లాసెట్, పిజిఎల్సెట్ పరీక్షకు 57,715 మంది దరఖాస్తు చేసుకోగా, 45,609 మంది హాజరయ్యారు. ఈ నెల 10న లాసెట్, పిజిఎల్సెట్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ విడుదల చేసి, వాటిపై అభ్యంతరాలు స్వీకరించారు. బుధవారం ఫలితాలు విడుదల చేయనున్నారు.
- Advertisement -