Wednesday, July 16, 2025

జూలై 23న విద్యాసంస్థల బంద్..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలు, జూనియర్ కళాశాలల బంద్ నిర్వహిస్తున్నట్లు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ప్రకటించారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడినీ అరికట్టాలని, విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలని వారు డిమాండ్ చేశారు. మంగళవారం విద్యాసంస్థల బంద్‌కు సంబంధించిన పోస్టర్ ను హిమాయత్ నగర్ లోని ఎఐఎస్‌ఎఫ్ కార్యాలయంలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠ, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ నాగరాజు, పిడిఎస్‌యు రాష్ట్ర కార్యదర్శి అనిల్, జాతీయ నాయకులు మహేష్, రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, ఎఐడిఎస్‌ఓ నేత నితీష్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అశోక్ ,కిరణ్ పిడిఎస్‌యు నాయకులు హరీశ్ నవీన్,శ్రీను,ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటు,కార్పొరేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తేవాలని, విద్యాశాఖ మంత్రిని తక్షణమే నియమించాలని, ఖాళీగా ఉన్న టీచర్, ఎంఈఓ,డిఈఓ పోస్టులను భర్తీ చెయ్యాలని, ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న బోజన పథకాన్ని అమలు చేయాలని, పెండింగ్ స్కాలర్ షిప్ లను విడుదల చేయాలని, అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు మౌలిక సదుపాయాలు కల్పించి,నిధులు కేటాయించాలని, బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలు విడుదల చెయ్యాలని, విద్యార్థులకు ఆర్‌టిసిలో ఉచిత బస్ పాస్ ఇవ్వాలని, ఎన్‌ఈపి 2020 తెలంగాణలో అమలు చెయ్యకుండా అసెంబ్లీలో తీర్మానం చెయ్యాలని సమావేశం డిమాండ్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News