Thursday, September 18, 2025

ధాన్యం లోడుతో వెళ్తున్న లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం

- Advertisement -
- Advertisement -

 

బిక్కనూర్ : కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలంలోని పెద్ద మల్లారెడ్డి సింగిల్ విండో సొసైటీ పరిధిలోని ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రం నుండి వరి ధాన్యాన్ని తీసుకెళుతున్న లారీ శనివారం గ్రామ శివారులో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. సమాచారం తెలుసుకున్న విండో అద్యక్షుడు రాజాగౌడ్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ధాన్యం బస్తాలను ఇతర లారీలో తరలించారు. ప్రమాదంలో లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News