- Advertisement -
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం చిత్తూరు నుంచి బెంగళూరు వెళ్తున్న ఆర్టీసి బస్సును కర్నాటకలోని హోస్ కోట్ సమీపంలో గొట్టిపుర గేట్ వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ కంట్రోల్ తప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని హుటాహుటినా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో చనిపోయిన వారిలో చిత్తూరు జిల్లా ఆళ్లమడుగుకు చెందిన నలుగురు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -