- Advertisement -
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం ధర్మపురి సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ కంట్రోల్ తప్పి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు తెలంగాణకు చెందిన వ్యక్తులు మృతి చెందినట్లు ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలైనట్లు ఆయన చెప్పారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే విషయం తెలసుకున్న స్థానిక పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -