Tuesday, June 17, 2025

పెళ్లికి ఒప్పుకోరనే భయంతో.. రైలు కిందపడి ప్రేమ జంట ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

భువనగిరి నగర శివారులో దారుణ ఘటన చోటు చేసుకుంది. రైలు కిందపడి ఓ ప్రేమ జంట (Love Couple)  ఆత్మహత్యకు పాల్పడింది. జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం నెమలికొండకు చెందిన మచ్చ శృతి (23), కె.వినయ్ కుమార్ (25) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమ విషయం పెద్దలకు తెలిసింది. ఎక్కడ వాళ్లు వివాహానికి నిరాకరిస్తారనే భయంతో ఆదివారం అర్థరాత్రి తర్వాత భువనగిరి శివారులో రైలు కిందపడి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే పోలీసులు సమాచారం తెలుసుకొని ఘటనస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం జనరల్ ఆస్సత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News