Saturday, September 13, 2025

రాహుల్ పై మాట్లాడే అర్హత కెటిఆర్ కు ఉందా?: మహేష్ గౌడ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఓట్ చోరీ గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధారాలతో నిరూపించారని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేల గురించి రాహుల్ ఎందుకు మాట్లాడాలి?అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం సిబి ఐకి అప్పజెప్పినా కేంద్రంలో ఎందుకు కదలిక లేదు? అని ఫార్ములా- ఈ కార్ రేసు కేసులో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కు జైలు ఖాయం అని అన్నారు.

ఢిల్లీలో బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హరీష్ రావు, కెటిఆర్, నరేంద్ర మోడిని కలిశారని తెలియజేశారు. వాళ్లు బిజెపిలో చేరినట్లు తాము కూడా నోటీసులు పంపిస్తామని, సిఎంగా రేవంత్ రెడ్డిని అందరూ కలుస్తారని మహేష్ పేర్కొన్నారు. ఫిరాయింపులపై రాహుల్ స్పందించాలని కెటిఆర్ అంటున్నారని చెప్పారు.  రాహుల్ పై మాట్లాడే అర్హత కెటిఆర్ కు ఉందా? అని ప్రశ్నించారు. కాళేశ్వరంపై సిబిఐ విచారణ తప్పించుకోవడానికే.. ఉపరాష్ట్రపతి ఎన్నికకు బిఆర్ఎస్ దూరంగా ఉందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

Also Read : హైకోర్టు తీర్పుపై అప్పీల్ కు వెళ్లాలనుకోవడం సిగ్గు చేటు: హరీశ్ రావు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News