- Advertisement -
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రివర్గంలో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని టిపిసిసి ఛీప్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బనకచర్ల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అన్నారు. (Phones tap) అయినవారి పేర్లు వెల్లడించాలని సిట్ ను కోరుతున్నానని చెప్పారు. మాజీ సిఎం కెసిఆర్, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రమేయంతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు భావిస్తున్నాం అని తెలియజేశారు. ఫోన్ ట్యాపింగ్ లో భాగమైన ప్రతీ ఒక్కరూ జైలుకు వెళ్లారని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
- Advertisement -