Sunday, June 29, 2025

కెసిఆర్, కెటిఆర్‌కు తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ జరగదు: మహేశ్‌కుమార్ గౌడ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ అంశంపై టిపిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌పై విరుచుకుపడ్డారు. వీరిద్దరికి తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగే అవకాశమే లేదని ఆయన అన్నారు. ఓ మీడియా ఛానెల్‌పై బిఆర్‌ఎస్ శ్రేణులు చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. సినీతారల ఫోన్లు ట్యాపింగ్ చేయడం ద్వారా వాళ్ల కుటుంబాల్లో చిచ్చు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ తారలు, జడ్జిలు, మహిళ నేతల ఫోన్లు ట్యాపింగ్ జరిగాయని ఆరోపించారు. వాళ్ల టార్గెట్ రాజకీయ నేతలు అయితే.. వాళ్ల ఇంట్లో ఉన్న మహిళల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశఆరని ప్రశ్నించారు. ఈ విషయంలో ఏదైనా అభ్యంతరం ఉంటే న్యాయపరంగా ముందుకు వెళ్లాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News