మీదీ ఇస్లామిక్ దేశమే, మాదీ ఇస్తామిక్ దేశమే అంటూ ముస్లిం కార్డును ప్లే చేసేందుకు పాకిస్తాన్ చేసిన ప్రయత్నాన్ని మలేషియా తిరస్కరించింది. ఆపరేషన్ సింధూర్, టెర్రరిస్ట్ కార్యకలాపాలకు పాక్ మద్దతు ఇస్తున్న విషయాన్ని వివరించేందుకు మలేషియాకు వెళ్లిన సంజయ్ ఝా నేతృత్వంలోని ప్రతినిధి బృందం కార్యక్రమాలను రద్దు చేయాలని మలేషియాపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించింది. అందుకోసం ముస్లిం కార్డును వాడుకునే యత్నం చేసింది. భారతీయ ప్రతినిధి వర్గం చెబుతున్న విషయాలను పట్టించుకోవద్దని మలేషియాకు నచ్చచెప్పే యత్నం చేసింది పాక్. అయితే మలేషియా ప్రభుత్వం భారత ప్రతినిధివర్గం చేపట్టిన పది కార్యక్రమాలకూ ఆమోదం తెలిపింది. కశ్మీర్ విషయం ఐక్యరాజ్యసమితిలో ఉందని పేర్కొంటూ, ఆపరేషన్ సిందూర్ తో పాటు భారత ప్రతినిధివర్గం చేపట్టే అన్నికార్యక్రమాలను రద్దు
చేయాలని పాకిస్తాన్ చేసిన అభ్యర్థనను మలేషియా ప్రభుత్వం పట్టించుకోలేదని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మలేషియాలోని పాక్ రాయబార కార్యాలయం ఇందుకు తీవ్రంగా కృషి చేసింది.సంజయ్ ఝా నేతృత్వంలోని ప్రతినిధివర్గం జపాన్, దక్షిణకొరియా, సింగపూర్, మలేషియాలలో పర్యటన పూర్తి చేసుకుని చివరిగా మలేషియాకు శనివారం నాడు చేరుకుంది.జేడీయూ ఎంపీ సంజయ్ ఝా ఆధ్వర్యంలో మలేషియాకు వెళ్లిన బృందంలో బీజేపీ ఎంపీలు అపరాజిత సారంగి, బ్రిజ్ లాల్, ప్రధాన్ బారుహ్ , హేమంగ్ జోషి, తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన అభిషేక్ బెనర్జీ, సీపీఎం ప్రతినిధఇ జాన్ బ్రిట్టాస్, కాంగ్రెస్ కు చెందిన సల్మాన్ కుర్షీద్, మోహన్ కుమార్, ఫ్రాన్స్ మాజీ రాయబారి ఉన్నారు. మాజీ ప్రధాని మహతీరి మొహమ్మద్ కేబినెట్ లోని మాజీ మంత్రి వైబి సిమ్ త్జిత్జీన్ ఆధ్వర్యంలి మలేషియా బృందాన్ని వారు కలిసి, ఆపరేషన్ సిందూర్ చేపట్టడానికి కారణాలు, టెర్రరిజాన్ని నిర్మూలించేందుకు భారత్ సంకల్పాలను వారికి వివరించారు.