- Advertisement -
కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేసిన వివిధ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే వచ్చే నెల 4వ తేదీన హైదరాబాద్కు రానున్నారు. ఉదయం 11 గంటలకు పిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ (పిఏసి) సమావేశంలో ఖర్గే పాల్గొంటారు. అనంతరం పార్టీ రాష్ట్ర కమిటీతో సమావేశమవుతారు. సాయంత్రం ఎల్బి స్టేడియంలో పార్టీ గ్రామ స్థాయి నాయకుల సమ్మేళనంలో ప్రసంగిస్తారు. ఈ సమావేశాల్లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు, పార్టీ రాష్ట్ర ముఖ్య నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్పోరేషన్ల చైర్మన్లు తదితర నాయకులు పాల్గొంటారు.
- Advertisement -