- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే వచ్చే నెల 4న హైదరాబాద్కు రానున్నారు. మంగళవారం జరిగిన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల సమావేశంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించే సభలో ఖర్గే పాల్గొంటారని ఆయన చెప్పారు. ఈ సభను విజయవంతం చేయడానికి పార్టీ నూతన కార్యవర్గం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన కోరారు. నూతన కార్యవర్గంతో కూడా ఖర్గే సమావేశమవుతారని ఆయన తెలిపారు.
- Advertisement -