Monday, June 30, 2025

ఎపిలో దారుణం.. భార్యపై కత్తితో దాడి.. అడ్డొచ్చిన అత్తమామలను నరికేశాడు

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మద్య మత్తులో అత్తమామలను నరికి చంపిన ఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని దుత్తలూరు ఎస్టీ కాలనీలో ఏలూరి వెంగయ్య, అంకమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో తాగొచ్చిన వెంగయ్య భార్యతో గొడవకు దిగాడు. కోపంతో కత్తి తీసుకుని భార్యపై దాడికి పాల్పడ్డాడు. దీంతో అత్తమామలు కంజయ్య, జయమ్మ అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిని దారుణంగా నరికి చంపేశాడు.

అలాగే, భర్త దాడిలో భార్య అంకమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం వెంగయ్య అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన భార్య అంకమ్మను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న వెంగయ్యను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News