Friday, June 13, 2025

ఈవెనింగ్ వాక్ కు వెళ్లిన ఇద్దరు మహిళల పట్ల ఒక వ్యక్తి..

- Advertisement -
- Advertisement -

నగరంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. బెంగళూరులోని కుక్ టౌన్ లో ని మిల్టన్ పార్క్ సమీపంలో ఈవెనింగ్ వాక్ కు వెళ్లిన ఇద్దరు మహిళల పట్ల ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. రెండు వేర్వేరు సంఘటనల్లో వారిని బలవంతంగా కౌగిలించుకుని ముద్దులు పెట్టాడని తెలిసింది. తర్వాత ఆ విషయం బయటకు చెప్పవద్దని బెదిరించినట్లు కూడా తెలిసింది. జూన్ 6న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఈ సంఘటనలు జరిగాయి. ఆ మహిళలు చెప్పినదాని ప్రకారం మొదట ఒక మహిళ తన కుటుంబసభ్యులతో కలిసి నడిచి వెళ్తుండగా ఆ వ్యక్తి ఆమెదగ్గరకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. కొన్ని నిముషాల తర్వాత ఆ వ్యక్తి పార్క్ లో ప్రవేశించి మరో మహిళను బలవంతంగా కౌగిలించుకుని, పెదవులపై ముద్దు పెట్టాడని తెలుస్తోంది.

రెండు ఘటనలు కొద్ది నిముషాల వ్యవధిలో జరిగాయి.వారిలో ఓ మహిళ గొడవపడడంతో ఎవరికైనా చెబుతే బాగుండదు అంటూ నిర్లక్ష్యంగా పొగరుగా బెదిరించి పారిపోయాడని చెబుతున్నారు. పులకేశినగర్ పోలీసు స్టేషన్ లో భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 74,75 కింద ఎఫ్ ఐఆర్ నమోదయింది. దర్యాప్తు జరుగుతోంది.ఏప్రిల్ 3న బెంగళూరులోనే ఇలాంటి మరో సంఘటన జరిగింది. బిటిఎం లే అవుట్ లో తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి ఒక మహిళను లైంగికంగా వేధించినట్లు సిసిటివి కెమెరాలో రికార్డయింది. నిందితుడు ఇద్దరు మహిళలను వెనుకనుంచి సమీపీంచి, వారిలో ఒకరిని అసభ్యంగా తాకి , తర్వాత పరారైనట్లు ఆ ఫుటేజ్ లో కన్పించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News